శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన
అమ్మవారికి లక్ష కుంకుమార్చన
ఉభయకర్తలుగా కొండూరు హరి నారాయణ రెడ్డి, సత్యవతి, వంశీ కృష్ణా రెడ్డి, సుజాతలు
అన్నదానంలో 28వ డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య
నెల్లూరు, మార్చి 1 (సదా మీకోసం) :
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ కర్తలుగా కొండూరు హరి నారాయణ రెడ్డి, సత్యవతి, వంశీ కృష్ణా రెడ్డి, సుజాతలు ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో మహా వైభవంగా 44 వ లక్ష కుంకుమార్చన నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో 44 వ లక్ష కుంకుమార్చన మహావైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ఉభయ కర్తలుగా కొండూరు హరి నారాయణ రెడ్డి, సత్యవతి, వంశీ కృష్ణా రెడ్డి, సుజాతలు వ్యవహరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో 28 వ డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య, మలేపాటి చైతన్య, సురేష్ రెడ్డి, రాజరాజేశ్వరి ఆలయ పాలకవర్గ సభ్యులు దొరబాబు, మోహన్ రెడ్డి, పెంచలమ్మ, పద్మజ, సతీష్, నాగమణి, కవిత తదితరులు పాల్గొన్నారు .