Breaking News ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ : మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
నెల్లూరు నగరం, ఏప్రిల్ 19 (సదా మీకోసం)
స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
స్వచ్చాంధ్ర -స్వచ్ఛ దివస్ కార్యక్రమం
ర్యాలీ ముగింపు సందర్భంగా ప్రతిజ్ఞ చేయించిన మంత్రి నారాయణ
మంత్రి నారాయణ కామెంట్స్
ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛ దివస్ జరుపుకొంటున్నాము
నెలకో థీమ్ తో ముందుకెళుతున్నాం
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఏపీ ని తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు నాయుడి లక్ష్యం
ప్రతీ నెలా క్రమం తప్పకుండా నిర్వహించేలా కార్యక్రమం డిజైన్ చేసారు
స్వచ్ఛమైన ఆలోచనలు ,స్వచ్ఛమైన పరిసరాలు,స్వచ్ఛమైన ఇల్లు ఉంటె అంతా స్వచ్ఛంగా ఉంటుంది
ప్రజలందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ దివస్ నిర్వహిస్తున్నాము
గతప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త దర్శనమిచ్చేది
ఆ ప్రభుత్వం కూడా చెత్త ప్రభుత్వంగా పేరు తెచ్చుకొంది
చెత్తపన్ను పై పెట్టిన శ్రద్ద పారిశుద్ధ్యం పై జగన్ సర్కార్ పెట్టలేదు
మున్సిపాలిటీ నిధులను కూడా దారి మళ్లించారు
పన్నుల ద్వారా వచ్చే మొత్తాన్ని మున్సిపాలిటీల అభివృద్ధికే వెచ్చించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు
ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
123 మున్సిపాలిటీల్లో స్వచ్చంద్ర వైపు దూసుకెళుతున్నాయి
గతప్రభుత్వం పది లక్షల అప్పుతో పాటు ,85 లక్షల టన్నుల చెత్త వదిలి వెళ్ళింది
వచ్చే అక్టోబర్ నాటికి ఆంద్రప్రదేశ్ ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాము



