ముఖ్యమంత్రిని కలిసిన సిఎస్ ఆదిత్యనాథ్ దాస్

ముఖ్యమంత్రిని కలిసిన సిఎస్ ఆదిత్యనాథ్ దాస్
-: అమరావతి, జూన్ 28 (సదా మీకోసం) :-
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కలిసారు.
ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో, ఆయన పదవీ కాలాన్ని జులై 1 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.