జ‌డ్పీలో పొట్టి శ్రీ‌రాములు జ‌యంతి వేడుక‌లు

Spread the love

జ‌డ్పీలో పొట్టి శ్రీ‌రాములు జ‌యంతి వేడుక‌లు

ఆయ‌న ప్రాణ త్యాగ‌మే ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ఏర్ప‌టు

జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

నెల్లూరు జ‌డ్పీ, మార్చి 16 (స‌దా మీకోసం) :

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్బంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు శ్రీ పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర సాదన కొరకు శ్రీ పొట్టి శ్రీ‌రాములు గారు చేసిన త్యాగములను ఎంతో కొనియాడారు.

ఆయ‌న ఆమరణ నిరాహార దీక్ష, వారి ప్రాణ త్యాగము వలన మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగిందని తెలిపారు.

ఆ మహనీయుని పేరు మన జిల్లాకి పెట్టడం ఎంతో గర్వంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

కార్యక్రమం నందు జ‌డ్పీ సిఇవో యం.శ్రీనివాస రావు, కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

19న ఆల్ ఇండియా కళారంగం నూత‌న కార్య‌వ‌ర్గ ఎన్నిక‌

Spread the love19న ఆల్ ఇండియా కళారంగం నూత‌న కార్య‌వ‌ర్గ ఎన్నిక‌ నెల్లూరు సాంస్కృతికం, మార్చి 16 (స‌దా మీకోసం) : నెల్లూరు నగరంలోని రేబాల లక్ష్మీ నరసారెడ్డి పురమందిరంలో మార్చి 19వ తేది సకల వృత్తి కళారంగం (ఆల్ ఇండియా కళారంగం) నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రాష్ట్ర స్థాయి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. […]

You May Like

You cannot copy content of this page