ఒంటి పూట బడులు, వేస‌వి సెల‌వ‌లు మంజూరు చేయండి : భార‌తీయ యువ‌మోర్చా జిల్లా అధ్య‌క్ష‌లు య‌శ్వంత్ సింగ్

Spread the love

ఒంటి పూట బడులు, వేస‌వి సెల‌వ‌లు మంజూరు చేయండి

భార‌తీయ యువ‌మోర్చా జిల్లా అధ్య‌క్ష‌లు య‌శ్వంత్ సింగ్

నెల్లూరు న‌గ‌రం, మార్చి 17 (స‌దా మీకోసం) :

ఒంటి పూట బడులు, వేసవి సెలవల మంజూరులో జాప్యం గురించి కలెక్టర్ కార్యాల‌యంలో ఏవో సుబ్రహ్మణ్యంని భార‌తీయ యువ‌మోర్చా జిల్లా అధ్య‌క్ష‌లు య‌శ్వంత్ సింగ్ ఆధ్వ‌ర్యంలో క‌ల‌సి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, వాతావరణం లోని మార్పులు, వేసవికాలంలో మండుటెండలు కారణంగా విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వాలు పాఠశాలలకు మార్చి నెలలో ఒంటిపూట బడులు, అనంతరం నడివేసవి అయినటువంటి మే నెలలో వేసవి సెలవలు ఇవ్వడం అనేది పరిపాటిగా జ‌రుగుతుంద‌ని గుర్తు చేశారు.

 

పసిబిడ్డల శ్రేయస్సు దృష్ట్యా ఎప్పటినుండో ఉన్నటువంటి ఈ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం అనాలోచింతంగా తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు వలన విద్యార్థుల యొక్క ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని తెలిపారు. అధికారులు ఈ విషయం పై దృష్టి సారించి ఈ మండుటెండలో విద్యార్థులు ప్రాణాలు పణంగా పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తొందరూపాటు చర్య వలన విద్యార్ధులు, ఉపాధ్యాయులు జరిగే నష్టాన్ని గుర్తించి పాఠశాలకు త్వరితగతిన ఒంటిపూట బడులు, అనంతరం సకాలంలో వేసవి సెలవులు ఇచ్చి వేసవిలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఇతర విద్యా సిబ్బంది. అవస్థలు పడి వడదెబ్బలకు గురై ప్రాణాలు కోల్పోకుండా వారిని ఆదుకోవాలని భారతీయ జనతా యువమోర్చా త‌ర‌పున కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అఖిల ప‌క్షాల ర్యాలీ విజ‌య‌వంతం

Spread the loveఅఖిల ప‌క్షాల ర్యాలీ విజ‌య‌వంతం జెన్కొ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా అఖిల ప‌క్షాల పిలుపు ప్రజల హక్కులకు భవిష్యత్తుకు ఆటంకం కలిగించవద్దు సోమిరెడ్డికి స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌ నెల్లూరు ప్ర‌తినిధి, మార్చి 17 (స‌దా మీకోసం) : ఎన్ని ఆటంకాలు కలిగించిన కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టును అదాని కంపెనీకు అప్పగించే రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయంపై నెల్లూరు జిల్లా ప్రజానీకంతో పాటు కార్మికులు తమ నిరసనను తెలియజేశారు. ఈ […]

You May Like

error: Content is protected !!