తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి

Spread the love

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి

-: హైదరాబాద్‌, జూన్ 26 (సదా మీకోసం) :-

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ(అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ) ప్రకటించింది.

ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇక టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌గా మహ్మద్‌ అజారుద్దీన్‌, జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌లు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్‌ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, రమేశ్‌ ముదిరాజ్‌, గోపిశెట్టి నిరంజన్‌, టి.కుమార్‌ రావు, జావేద్‌ ఆమీర్‌ నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రచారకమిటీకి ఛైర్మన్‌గా మధు యాస్కీ గౌడ్‌, కన్వీనర్‌గా సయ్యద్‌ అజమ్‌తుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా దామోదర్‌ సి.రాజ నర్సింహయ్య, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఆలేటి మహేశ్వరరెడ్డి నియమితులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు, జీవితాన్ని బలి చేసుకోవద్దు : ఎస్‌.ఇ.బి. జాయింట్ డైరెక్టర్

Spread the loveమాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు, జీవితాన్ని బలి చేసుకోవద్దు : ఎస్‌.ఇ.బి. జాయింట్ డైరెక్టర్ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలలో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహణ ఒక్కరిని బాగు చేస్తే ఒక కుటుంబాన్ని బాగుచేసినట్లే అక్రమంగా మాదకద్రవ్యాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు, కఠిన చర్యలు తీసుకుంటాం, ఎవరినీ ఉపేక్షించేది లేదు యువత, విద్యార్థులు చెడు స్నేహాలతో సరదాగా ప్రారంభించిన మాదక ద్రవ్యాల వినియోగం వారి భవిష్యత్‌ […]

You May Like

error: Content is protected !!