ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన ఫించన్లు పంపిణీ

Spread the love

ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన ఫించన్లు పంపిణీ

ఇందుకూరుపేట: జూలై 31 (సదా మీకోసం)

మండలంలోని కొత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో వై.యస్.ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం మండల పరిషత్ అభివృద్ధి అధికారి పఠాన్ రఫీఖాన్ అధ్యక్షత జరిగింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విచ్చేశారు. అందులో భాగంగా నూతనంగా మంజూరైన 337 కొత్త పెన్షన్లు లబ్దిదారులకు తన చేతుల మీదగా ఫింఛన్ కార్డులను ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అందజేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు, ఇందుకూరుపేట కో-పరేటివ్ బ్యాంక్ చైర్మన్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, జిల్లా డి.ఎల్.డి.ఏ. చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ శ్రీహరికోట విజయలక్ష్మి, ఎం.పీ.పీ  గందళ్ళ శంకరయ్య, వైస్ ఎం.పీ.పీ., ఎం.పీ.టీ.సీ.లు, సర్పంచులు, మండల అధికారులు, వారి సిబ్బంది పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రూరల్ లో ప్రతీ టీడీపీ కార్యకర్తను ఒక సైనికుడిలా తయారుచేస్తా : అబ్దుల్ అజీజ్

Spread the loveరూరల్ లో ప్రతీ టీడీపీ కార్యకర్తను ఒక సైనికుడిలా తయారుచేస్తా ప్రజల్లో మనకు ఉన్న శక్తిని మరింత పెంచుకోవాలి తెలివితో కలిసికట్టుగా పనిచేసి, మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి షేక్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్, జూలై 31 (సదా మీకోసం): నెల్లూరు రూరల్ నియోజకవర్గ క్లస్టర్ ఇంఛార్జి లతో ముఖ్య నేతలతో ఆదివారం నెల్లూరు […]
error: Content is protected !!