డివిజన్ల‌ అభివృద్ధికి అన్నీ నేను చూసుకుంటా : మంత్రి అనిల్

SM News
Spread the love

డివిజన్ల‌ అభివృద్ధికి అన్నీ నేను చూసుకుంటా : మంత్రి అనిల్

-: నెల్లూరు న‌గ‌రం‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :-

నెల్లూరు నగరంలోని 14 వ డివిజన్ తో పాటు బాలాజీ నగర్ ఏసీ నగర్ తదితర ప్రాంతాల్లో వచ్చే అన్ని డివిజన్లలో అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తామని మంత్రి అనిల్ పేర్కొన్నారు.

ఈ పరిధిలో వచ్చే మూడు డివిజన్లను సమగ్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.

ఈ ప్రాంతంలో గత కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలుపొందడం ఆయన నియోజకవర్గ ఇన్చార్జి ముఖ్య అనుచరుడుగా ఉండటంతో అతనికి ఈ సారి చెక్ పెట్టేందుకు అన్ని రకాల వ్యూహాలు గత రెండేళ్లుగా జరుగుతున్నాయి.

ఈ ప్రాంతంలో వైసిపిని తిరుగులేని శక్తిగా మార్చేందుకు వైసిపి అన్ని పావులు కదిపింది.

గతంలో 14 వ డివిజన్ లో పోటీ చేసిన ఇద్దరు బలమైన అభ్యర్థులు వైసీపీలో ఉన్నారు.

నెల్లూరు బాలాజీ నగర్ ఏసీ నగర్ లో పర్యటిస్తున్న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా అక్కడి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే ఈ డివిజన్ లలో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలను మరింత ముమ్మరం చేయాలి అన్నారు.

కార్యక్రమంలో కర్తం ప్రతాప్ రెడ్డి , లోకిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వందవాసి రంగా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

గుడూరు మున్సిపాలిటీలో ప‌ర్య‌టించిన ఎమ్మెల్యే వెల‌గ‌ప‌ల్లి

Spread the loveగుడూరు మున్సిపాలిటీలో ప‌ర్య‌టించిన ఎమ్మెల్యే వెల‌గ‌ప‌ల్లి -: గూడూరు‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :- గూడూరు పట్టణంలోని శ్రీ మహా లక్ష్మమ్మ వీధి, కటక రాజవీధి 9, 10వ వార్డుల‌లో గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద రావు పర్యటించారు. వర్షం పడినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామని సిసి రోడ్లను మంజూరయ్యాయని వాటి పనులు త్వరగా పూర్తి చేసి ఇవ్వాలని మహా లక్ష్మమ్మ వీధిలోని ప్రజలు ఎమ్మెల్యేని […]

You May Like

error: Content is protected !!