కరోనా రోగులతో కలెక్టర్ కాన్ఫరెన్స్‌

SM News
Spread the love

వివిధ క్వారంటైన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ రోగులతో కలెక్టర్‌ చక్రధర్‌బాబు మంగళవారం రాత్రి మాట్లాడారు. నగరంలోని జెడ్పీ ఆవరణలో గల డీఈఓసీ కేంద్రం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా కలెక్టర్‌ రోగులతో మాట్లాడారు. ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. వైద్య చికిత్స ఎలా అందుతోంది.. వైద్యులు అందుబాటులో ఉన్నారానని ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. వైద్యులు మెరుగైన చికిత్సను అందిస్తారని.. ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. రోజూ జూమ్‌ యాప్‌ ద్వారా రోగులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. అనంతరం డీఈఓసీ కేంద్రంలో పనిచేసే సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రంగుల ప్ర‌పంచం వెన‌కున్న దారుణ నిజాలు

Spread the loveచిత్ర ప‌రిశ్ర‌మ అనేది ఓ మాయా ప్ర‌పంచం. బ‌య‌టినుంచి చూసేవాళ్ల‌కి అదో రంగుల‌లోకం. ఏమీ లేని స్థాయి నుంచి స్టార్లుగా ఎదిగిన వాళ్లు కొంద‌రుంటే ఎక్క‌డినుంచి మొద‌లు పెట్టారో తిరిగి అక్క‌డికే చేరేవాళ్లు మ‌రికొంద‌రుంటారు. ఒక్క సినిమా హిట్ అయితే రాత్రికి రాత్రే స్టార్లు అయిన‌వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ క్రేజ్‌ ఎక్కువ‌కాలం నిల‌వాలంటే మాత్రం క‌ఠోర శ్ర‌మ‌, గ్లామ‌ర్, అదృష్టం..ఇలా అన్నీ క‌లిసిరావాలి లేదంటే ఇండస్ట్రీలో నెగ్గుకురావ‌డం […]

You cannot copy content of this page