యస్.యస్.డి. జిల్లా అధ్యక్షుడుగా కార్తికేయ

Spread the love

యస్.యస్.డి. జిల్లా అధ్యక్షుడుగా కార్తికేయ

ఇందుకూరుపేట, జూలై 25 (స‌దా మీకోసం) :

సమతా సైనిక్ దళ్ (యస్.యస్.డి.) నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా పోలవరపు కార్తికేయ ను నూతనంగా నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు తెలిపారు.

నిన్న విజయవాడలో జరిగిన యస్.యస్.డి. రాష్ట్రస్థాయి సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుని, ఆ మేరకు సమావేశంలో ప్రకటన చేశారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SC. కమీషన్ చైర్మన్ మారుముడి విక్టర్ ప్రసాద్ చేతుల మీదుగా జిల్లా అధ్యక్షుడు నియమిత పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారతరత్న, బాబా సాహెబ్ డాక్టర్ బి.అర్ అంబేడ్కర్ స్వయంగా 1924 లో స్థాపించిన సమతా సైనిక్ దళ్ సంస్థలో పని చేసేందుకు అవకాశం రావడం చాలా సంతోషంగా వుందన్నారు.

ఇక నుండి దళితుల సమస్యలపై దృష్టి సారించి, సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ, సహకారాలు అందిస్తానని,తమ జాతి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ముఖ్యమంత్రికి ప్ర‌జా ఆరోగ్య వేదిక లేఖ‌

Spread the loveముఖ్యమంత్రికి ప్ర‌జా ఆరోగ్య వేదిక లేఖ‌ సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోండి విశాఖప‌ట్నం, జూలై 25 (స‌దా మీకోసం) : సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కమిటీ అధ్య‌క్షులు డా. యం.వి. ర‌మ‌ణ‌య్య‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టి. కామేశ్వ‌ర‌రావులు లేఖ రూపంలో ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. ఆ లేఖ‌లో వర్షాకాలపు వ్యాధుల నివారణకు అన్ని […]
error: Content is protected !!