పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం : ఎంపీ వేమిరెడ్డి
కోవూరు, ఏప్రిల్ 30 (సదా మీకోసం) :
కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం అత్యంత విషాదకరమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు.
కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇంటి యజమాని రమణయ్యతో పాటు నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థులు యగ్నేష్, జీవన్ నారాయణ, నరేష్, అభిసాయి, అభిషేక్ మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందన్నారు.
ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు.
పోతిరెడ్డిపాలెం వద్ద కారు ప్రమాదంలో ఆరుగురు మృతి కలచి వేసింది
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం వద్ద కారు ఇంట్లోకి దూసుకెళ్లిన సంఘటనలో 6 గురు మృత్యువాత పడడం అత్యంత బాధాకరం అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.
సుబ్బారెడ్డి పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థులు యగ్నేష్, జీవన్ నారాయణ, నరేష్, అభిసాయి, అభిషేక్ మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందన్నారు.
కారు ఇంటిలోనికి దూసుకెళ్లిన సంఘటనలో ఇంటి యజమాని రమణయ్య మృతి చెందడం విషాదకరమన్నారు.
మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
అలాగే బాధిత కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం యిచ్చి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.