ఘనంగా ప్రారంభమైన మెగా రక్తదాన శిబిరం
నెల్లూరు, ఏప్రిల్ 19 (సదా మీకోసం)
నెల్లూరు పార్లమెంటు సభ్యులు, ప్రియతమ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం ఘనంగా ప్రారంభమైంది.
పలువురు ముఖ్య నేతలు, నాయకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేశారు.
నేతలు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీ రెడ్డి, కృపాకర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు రక్తదానం చేశారు.
ఈ శిబిరంలో పాల్గొనేందుకు యువత భారీగా చేరుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేశారు.











