దుప్పట్లు పంపిణీ చేసిన ధర్మసింధు

Spread the love

దుప్పట్లు పంపిణీ చేసిన ధర్మసింధు


ఇందుకూరుపేట నవంబరు 28 (సదా మీకోసం)

మండలంలోని గంగపట్నం మజరా కాలువమూలకండ్రిగ గ్రామ వరద బాధితులకు ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధర్మసింధు అధ్యక్షుడు ధన్వి శ్రీనివాస్ మాట్లాడుతూ మొన్న వచ్చిన వరదలకు అన్నీ పోగొట్టుకుని నిరాశ్రయులైన నిరుపేదలకు సమితి తరపున దుప్పట్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా వుందన్నారు. సమితి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు కాలువమూల కండ్రిగ గ్రామాన్ని సందర్శించడం జరిగిందని, అడిగిన వెంటనే స్పందించి ఆర్ధిక సహకారం అందించిన
దాతలు ప్రభాకర్ వర్మ, భట్టారం సత్యేంద్ర లకు గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ నిర్వహకులుగా పోలవరపు కార్తికేయ, గోళ్ళ సతీష్ కుమార్ వ్యవహరించగా, కార్యక్రమంలో
సమితి సభ్యులు గోనుపల్లి నవీన్ కుమార్, పాశం నరసింహరావు, తిరుపతి సాంబశివ, కొత్తింటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కుల,లింగ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలితరం సామాజిక విప్లవ కారుడు మహాత్మా పూలే : చేజర్ల

Spread the loveకుల,లింగ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలితరం సామాజిక విప్లవ కారుడు మహాత్మా పూలే నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి బలహీన వర్గాలు,ఆర్ధికంగా రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందలనే పూలే గారి ఆశయాలను అమలు చేసిన మొదటి వ్యకి ఎన్టీఆర్ కోవూరు, న‌వంబ‌ర్ 29 (స‌దా మీకోసం) : మహాత్మా జ్యోతిరావు పూలే గారి 131 వ వర్ధంతి సందర్భంగా కోవూరు […]
error: Content is protected !!