రైతులను దోచుకోవడం మాని అన్నదాతను ఆదుకోండి : మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Spread the love

రైతులను దోచుకోవడం మాని అన్నదాతను ఆదుకోండి

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

-: వెంకటాచలం, ఏప్రిల్ 02 (సదా మీ కోసం) :-

వెంకటాచలం మండలం ఈదగాలి పంచాయితీ పరిధిలో రైతులను శనివారం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలుకరించి వారి కష్ట నష్టాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం లో భూదందాలు . గ్రావెల్ మైనింగ్ మాఫియా. టోల్గేట్ల పేరుతో దోపిడి వంటి దందాలు నిమగ్నమయ్యారని విమర్శించారు.

జిల్లాలో ఏ రోజు అయినా ఒక్క ఎమ్మెల్యే అయినా రైతుల వడ్ల కళ్ళం లో పోయి వారి బాధలు విన్నట్లు మేము చూడ లేదన్నారు.

రైతులకు అండగా మేము భారీ ర్యాలీ చేపట్టామని, అయినా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన రాలేదని,
రైతుల ఉసురు తగిలితే మీరు, మీ ప్రభుత్వం పతనం అవడం ఖాయం అని తెలిపారు.

కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు. గుమ్మడి రాజు యాదవ్, తిరుపతి పార్లమెంటరీ టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మామిళ్ళపల్లి శ్రీనివాస నాయుడు, తిరుపతి పార్లమెంటరీ రైతు విభాగం అధ్యక్షులు రావూరి రాధాకృష్ణన్ నాయుడు, టిడిపి జిల్లా మైనార్టీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి పఠాన్ హుసేన్ ఖాన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సమరసత ఆధ్వర్యంలో భజన బృందానికి యూనిఫాం పంపిణీ

Spread the loveసమరసత ఆధ్వర్యంలో భజన బృందానికి యూనిఫాం పంపిణీ తోటపల్లి గూడూరు ఏప్రిల్ 02 (సదా మీకోసం) మండలంలోని మల్లిఖార్జునపురం యస్.సి. కాలనీ నందు వున్న శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం భజన బృందం సభ్యులకు మండపం గ్రామ నివాసి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మోహన్ చేతుల మీదుగా యూనిఫారం వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత హిందూ […]

You May Like

error: Content is protected !!