డ్రైన్‌కు శంఖాస్థాప‌న చేసిన కార్పొరేట‌ర్ క‌ర‌ణం మంజుల‌

Spread the love

డ్రైన్‌కు శంఖాస్థాప‌న చేసిన కార్పొరేట‌ర్ క‌ర‌ణం మంజుల‌

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌ర‌ణం హ‌జ‌ర‌త్ నాయుడు

రూర‌ల్ ఎమ్మెల్యేకి అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌జ‌లు

నెల్లూరు రూర‌ల్‌, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) :

నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలోని 33వ డివిజన్ వెంగల్ రావు నగర్ లో సి బ్లాక్ 5వ వీధిలో డ్రైన్ కు కార్పొరేట‌ర్ క‌ర‌ణం మంజుల,అభివృద్ది క‌మిటి ఛైర్మ‌న్ క‌ర‌ణం హ‌జ‌ర‌త్ నాయుడులు శంకుస్థాపన చేశారు.

ఈ డ్రైన్ గత కొంతకాలంగా పాడై పోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ఆ సమస్యను స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లడం తో డివిజన్ అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు నేను నా కార్యకర్త కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి సమస్యను వివ‌రించారు.

సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే వారం రోజుల వ్యవధిలోనే ఈ డ్రైన్ కు శాంక్షన్ ఆర్డర్స్ ఇప్పించ‌డం జ‌రిగింద‌ని హ‌జ‌ర‌త్ నాయుడు తెలిపారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత 33వ డివిజన్ కు దాదాపు మూడు కోట్ల రూపాయల ప‌నుల‌ను చేయ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా డివిజన్ లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, వైసీపీ మహిళా నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఆ మూడు మండ‌లాలు నెల్లూరు జిల్లాలోనే కొన‌సాగించండి : ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి

Spread the loveఆ మూడు మండ‌లాలు నెల్లూరు జిల్లాలోనే కొన‌సాగించండి అధికారులు వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకొన్నారు సోమశిల ప్రాజెక్ట్ కూడా నాగార్జున సాగర్ లా వివాదాస్పదం అయ్యే ప్రమాదం మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు ప్ర‌తినిధి, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : జిల్లాల పునర్విభజన పై జిల్లాలోని ఎమ్మెల్యేలతో, ప్రజాప్రతినిధులతో చర్చించలేదని, అధికారులు వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకొన్నారని, ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోలేదని […]
error: Content is protected !!