టీడీపీ సీనియర్ కార్యకర్త ఇబ్రహీం హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం : అచ్చెన్నాయుడు

Spread the love

టీడీపీ సీనియర్ కార్యకర్త ఇబ్రహీం హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం

  • వైసీపీ వచ్చాక మైనార్టీలను ఊచకోత కోస్తున్నారు.

  • ముగ్గురు ఉన్మాదులు పల్నాడును వల్లకాడు చేస్తున్నారు.

  • కింజరపు అచ్చెన్నాయుడు

నరసరావు పేట, స‌దా మీకోసం :

నరసరావు పేట ఘ‌ట‌న‌పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు కింజ‌ర‌పు అచ్చెన్నాయుడు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆ ప్ర‌క‌ట‌న‌లో ఆయ‌న‌ “టీడీపీ సీనియర్ కార్యకర్త ఇబ్రహీంను వైసీపీ గూండాలు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

మాచర్లలో మెన్నటి విధ్వంసం మరువక ముందే పల్నాడులో మరో ముస్లీం కార్యకర్తను పొట్టన పెట్టుకున్నారు.

దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అణుచరుడుపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.

ముగ్గురు ఉన్మాదులు పల్నాడును వల్లకాడు చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిని పల్నాడు నుంచి ప్రజలు తన్ని తరిమే రోజులు దగ్గర లోనే ఉన్నాయి.

వైసీపీ నేతలు కృూర జంతువుల్లా టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకుంటున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలను ఊచకోత కోస్తున్నారు. జగన్ రెడ్డికి పుట్టిన రోజు బహుమతిగా మైనారిటీ సోదరుని శవాన్ని గోపిరెడ్డి అందించారు.

ఇకనైనా హత్యా రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టకపోతే వైసీపీకి మిగిలేది శంకరగిరి మాన్యాలే. ఇబ్రహీం ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. ఇబ్రహీం కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Sadha Meekosam Daily 22-12-2022 E-Paper Issue

Spread the loveSadha Meekosam Daily 22-12-2022 E-Paper Issue   విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ కు […]
error: Content is protected !!