సచివాలయ అధికారులతో మరియు వాలంటీర్లతో స‌మావేశం నిర్వ‌హించిన గిరిధ‌ర్ రెడ్డి

0
Spread the love

సచివాలయ అధికారులతో మరియు వాలంటీర్లతో స‌మావేశం నిర్వ‌హించిన గిరిధ‌ర్ రెడ్డి

నెల్లూరు రూర‌ల్‌, మార్చి 19 (స‌దా మీకోసం)

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కందమూరు, ఉప్పుటూరు, ములుముడి మరియు కొమ్మరపూడి గ్రామాలలోని సచివాలయ అధికారులతో, వాలంటీర్లతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూరల్ మండల అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలమేరకు 3వ రోజు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు.

కార్యక్రమంలో రూరల్ మండల కన్వీనర్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు మీరా మొహిద్దీన్, కందమూరు, ఉప్పుటూరు, ములుముడి, కొమ్మరపూడి గ్రామ సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, ఎమ్.పి.టి.సి. లు, స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!