పేర్నేటిని అభినందించిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి
-: కోవూరు, జూలై 26 (సదా మీకోసం) :-
ఆంధ్రప్రదేశ్ సీడ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా పేర్నేటి సుస్మితా రెడ్డిని నియమితులైన సందర్భంగా నెల్లూరు లోని మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే అభినందించి శాలువా కప్పి సన్మానించారు.
కార్యక్రమంలో నెల్లూరు జిల్లా డిఎఎబి ఛైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, వైకాపా రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాప వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు.