మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
ఒంగోలు వైద్యం, ఏప్రిల్ 30 (సదా మీకోసం) :
జిల్లా లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, వైద్యాదికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, వైద్యాదికారులతో సమావేశమై జిల్లా లోని గిద్దలూరు, వై. పాలెం, కొండపి, మార్కాపురం, రిమ్స్ ఆసుపత్రుల్లో నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత మెడికల్ అధికారులతో సమీక్షించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది.
జిల్లా లో మాతృ మరణాలు తగ్గించడం, పుట్టిన బిడ్డలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు ప్రధాన ఉద్దేశ్యమన్నారు.
కనిగిరి ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన విధంగా నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాన్ని గిద్దలూరు, వై. పాలెం, కొండపి, మార్కాపురం, రిమ్స్ ఆసుపత్రుల్లో ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, అందుకు సంబంధించిన పనులను సత్వరం పూర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, డిసిహెచ్ఎస్ డా. శ్రీనివాస నాయక, ఎపిఎమ్ఎస్ఐడిసి ఈఈ శ నిర్మల్ కుమార్, కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ రీసర్చ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి శ్రావ్య, గిద్దలూరు, వై. పాలెం, కొండపి, మార్కాపురం, ఆసుపత్రుల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.