ఘనంగా 51వ డివిజన్లో మొదలైన పవనన్న ప్రజాబాట

Spread the love

ఘనంగా 51వ డివిజన్లో మొదలైన పవనన్న ప్రజాబాట

నెల్లూరు న‌గ‌రం, ఆగ‌ష్టు 5 (స‌దా మీకోసం) :

నెల్లూరు న‌గ‌ర‌ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 80 రోజులు పూర్తి చేసుకుంది.

నేడు 81వ రోజున 51వ డివిజన్ కపాడిపాళెం ప్రాంతంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ప్రారంభించారు.

స్థానిక జనసేన నాయకులు కాయల వరప్రసాద్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు కోలాహలంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ 80 రోజుల క్రితం ప్రారంభమైన పవనన్న ప్రజాబాట నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 3, 4, 5, 39, 40 మొత్తం ఐదు డివిజన్లలో ఏ ఒక్క ఇంటిని కూడా విస్మరించకుండా, ఐదో అంతస్తులోని కుటుంబాలను కూడా పలుకరిస్తూ సాగిందన్నారు.

ప్రజలందరూ అపూర్వంగా ఆదరిస్తున్నారని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, వారి ఆదరాభిమానాలతో రెట్టింపు ఉత్సాహంతో ప్రజాబాటని నిర్వహిస్తున్నామని అన్నారు.

ఒక్కో డివిజన్లో మొత్తం అన్ని ఇళ్ళకు తిరిగి సమస్యలను అధ్యయనం చేయడానికి 15 రోజుల నుండి 20 రోజుల వరకు పడుతోందని, ఇప్పుడు ప్రారంభించిన 51వ డివిజన్లో కూడా సుమారు రెండు వారాలకు పైగానే పట్టొచ్చని అన్నారు.

కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Sadha Meekosam Daily 06-08-2022 E-Paper Issue

Spread the loveSadha Meekosam Daily 06-08-2022 E-Paper Issue   విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ కు […]

You May Like

error: Content is protected !!