బాధ్యతలు స్వీకరించిన నూత‌న‌ కమిషనర్ జాహ్న‌వి

Spread the love

బాధ్యతలు స్వీకరించిన నూత‌న‌ కమిషనర్ జాహ్న‌వి

నెల్లూరు కార్పొరేష‌న్‌, ఏప్రిల్ 4 (స‌దా మీకోసం) :

నెల్లూరు నగర పాలక సంస్థ నూతన కమిషనర్ గా ఎమ్.జాహ్నవి సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కార్యాలయంలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్షించి నగరాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.

సాధారణ బదిలీల్లో భాగంగా నెల్లూరు నగర కమిషనర్ గా ఉన్న దినేష్ కుమార్ ను సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్గా బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

నెల్లూరు జిల్లా (హౌసింగ్ ) జాయింట్ కలెక్టర్ గా ఉన్న‌ జాహ్నవి ని నెల్లూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ కమిషనర్ గా బ‌దిలీ చేశారు.

కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కార్పొరేష‌న్ ఈఈ, డిఈలు క‌లిసి పుష్ప‌గుచ్చం అంద‌జేశారు.

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CPM News : ధ‌ర‌లు పెంచ‌డాన్ని నిర‌సిస్తూ సిపియం నిర‌స‌న‌

Spread the loveధ‌ర‌లు పెంచ‌డాన్ని నిర‌సిస్తూ సిపియం నిర‌స‌న‌ నెల్లూరు రూర‌ల్‌, ఏప్రిల్ 4 (స‌దా మీకోసం) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజల్, గ్యాస్, విద్యుత్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచడాన్ని నిరసిస్తూ, సిపిఎం నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప గుడి సెంటర్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. CPM News కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శివర్గ […]

You May Like

error: Content is protected !!