భారత్‌లో పెట్టుబడులు పెట్టండి: మోదీ

SM News
Spread the love

న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా కంపెనీలకు ఆహ్వానం పలికారు. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నేతృత్వంలో జరిగిన ఇండియా ఐడియాస్ సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.

బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐకి అనుమతిచ్చామని మోదీ గుర్తు చేశారు. రక్షణ రంగంలోనూ అలాగే అంతరిక్ష రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలని సూచించారు. రక్షణ రంగంలో ఏకంగా 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. టెక్నాలజీ, మౌలిక వసతుల కల్పన రంగంలో కూడా పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. ఇళ్లు, రోడ్లు, హైవేలు, పోర్టుల నిర్మాణంలో భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. భారత్-అమెరికా సహజ మిత్రులన్న ప్రధాని ఆత్మనిర్భర్ భారత్‌ కోసం అమెరికా తోడ్పాటు అవసరమని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

యూపీలో రికార్డు స్థాయికి కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..

Spread the loveలక్నో: ఉత్తర ప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ 2308 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యూపీలో ఒకేరోజు ఇన్ని కరోనా కేసులు రావడం ఇదే తొలిసారి అని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 55,588కి చేరినట్టు వెల్లడించారు. కాగా గడచిన 24 గంటల్లో ఉత్తర ప్రదేశ్‌లో […]
error: Content is protected !!