తేలు కుడితే చల్లటి కాపటం పెట్టండి..!

Spread the love

తేలు కుడితే చల్లటి కాపటం పెట్టండి..!

పాము కంటే తేలు ప్రమాదకరమైంది.
ఎందుకంటే పాము విషానికి విరుగుడు మందుంది. తేలు విషానికి విరుగుడు మందులేదు.విరుగుడు మందు లేదు కాబట్టి ప్రాధమిక వైద్యం చాలా ముఖ్యం.తేలు కుట్టినప్పుడు వచ్చే నొప్పిని తగ్గించుకోవడం అందులో ప్రధానం.

తేలు నొప్పి ప్రత్యేకత
°°°°°°°°°°°°°°°°°°°°

తేలు కుడితే వచ్చే నొప్పి భరించలేనంత తీవ్రంగా వుంటుంది. చెప్పనలవి కాని విధంగా వుంటుంది.

* నొప్పిగా వుంటుంది.
* తిమ్మిరిగా వుంటుంది.
* పై పైకి హలో పాకినట్టుగా వుంటుంది.
* వీటన్నింటి కలగాపులగంగా కూడా వుంటుంది.

సాధారణంగా నొప్పికి వాడే సూదిమందుకు ఈ నొప్పి జవాబు చెప్పదు. కానీ చల్లటి కాపటంతో ఈ నొప్పిని చాలావరకు తగ్గించుకోవచ్చు.

చల్లటి కాపడం పెట్టడమెలా?
“““““““““““““““““
ఐసు ముక్కల్ని గుడ్డలో వేసి గానీ, ప్లాస్టిక్ కవర్లో వేసిగానీ, నీళ్లు తాగే గ్లాసులో వేసిగానీ తేలు కుట్టిన దగ్గర కాపటం పెట్టాలి.
5 నుంచి 10 నిముషాలపాటు కాపటం పెట్టాలి.10 నిముషాల తరువాత మళ్లీ 10 నిముషాల పాటు కాపటం పెట్టాలి.
ఇలా రెండు గంటలపాటు ఈ చల్లటి కాపటాన్ని కొనసాగిస్తూ వైద్యుని దగ్గరికి చేరుకోవాలి.

వైద్యుని దగ్గరికి చేరుకునే లోపు మరో రెండు పనులు చేయడం మంచిది.

1. తేలు కుట్టిన శరీర భాగాన్ని గుండె కంటే దిగువ వుండేటట్లు చూసుకోవడం.

2. తేలు కుట్టిన శరీర భాగంలో బిగుతుగా వుండే మెట్టెలు, ఉంగరం,గజ్జెలు, గాజులు లాంటి ఆభరణాలను వెంటనే తీసివేయడం.

కాటుకి గురైన భాగాన్ని గుండె
కంటే తక్కువ ఎత్తులో వుండే విధంగా వుంచితే కరచిన భాగంలో వున్న విషం గుండెకు చేరడానికి కొంత ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం తగ్గుతుంది.

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
తేలు కుట్టిన శరీర భాగంలో ఉంగరాలు వుంటే, వాపు ఎక్కువై వేలుకు రక్తప్రసరణ తగ్గి వేలు తీసి వేయవలసిన పరిస్థితి రావచ్చు.

ప్రాథమిక వైద్యం చేసుకుంటూ వీలయినంత త్వరగా డాక్టర్ ద్వారానే మిగిలిన వైద్యం చేయించుకోవాలి

 

డా. యం. వి. రమణయ్య
రాష్ట్ర అధ్యక్షులు,
ప్రజారోగ్య వేదిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మే నెల 1న ఆత్మకూరులో సీఎం పర్యటన

Spread the love    మే నెల 1న ఆత్మకూరులో సీఎం పర్యటన త్వరలో అధికారికంగా ఖరారు కానున్న సీఎం పర్యటన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులు సంసిద్ధంగా ఉండాలని మంత్రి ఆనం ఆదేశం నెల్లూరు ప్రతినిధి, ఏప్రిల్ 21 (సదా మీకోసం) : సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో మే నెల 1వ తేదీన పర్యటించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం […]

You May Like

error: Content is protected !!