గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసన్న

Spread the love

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసన్న

 ఇందుకూరుపేట: అక్టోబరు 02 (సదా మీకోసం)

మండలంలోని డేవిస్ పేట గ్రామాన ఈ రోజు జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా తొలుత డేవిస్ పేట సచివాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం డేవిస్ పేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటి వద్ద వివరిస్తూ, గ్రామస్తులను పలకరిస్తూ తిరిగారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ మండలాధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ కుమార్ యాదవ్, వైసీపీ నాయకులు గునుపాటి సురేష్ రెడ్డి, స్థానిక పంచాయతీ వైసిపి నాయకులు నెల్లూరు వెంకటరమణయ్య, మండల స్థాయి, గ్రామస్థాయి అధికారులు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Sadha Meekosam Daily 04-10-2022 E-Paper Issue

Spread the loveSadha Meekosam Daily 04-10-2022 E-Paper Issue     విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ […]
error: Content is protected !!