అభినయంతో ఆకట్టుకుంటున్న కథానాయిక శ్రుతి హాసన్‌

Spread the love

అభినయంతో ఆకట్టుకుంటున్న కథానాయిక శ్రుతి హాసన్‌

అందం, అభినయంతో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్న కథానాయిక శ్రుతి హాసన్‌.

తాజాగా ఈమె డబ్బింగ్‌ పనులు మొదలు పెట్టినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్టును పంచుకుంది.

దీంతో ‘కూలీ’ చిత్రానికే ఈమె డబ్బింగ్‌ చెబుతున్నట్లు నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి.

కథానాయకుడు రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది.

యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్‌ నిర్మించారు.

కథానాయకుడు నాగార్జున, శుత్రి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అదీ భావితరాలను తయారు చేసే పద్ధతి.

Spread the love“ఫిన్లాండ్” దేశం లో, ఓ ఖాళీ రోడ్, మన వాడు ఒకడు అలవాటుగా, సిగ్నల్ లేకుండా దాటబోయాడు… ఇంతలో పక్కనే వున్న ఆ దేశంవ్యక్తి “రోడ్డు దాటవద్దు” అన్నాడు… మనవాడు “రోడ్డు ఖాళీనే కదా దాటితే యేం” అన్నాడు… అప్పుడా వ్యక్తి, “పిల్లలు ఎవరైనా చూస్తారేమో” అన్నాడు.మనవాడికి అర్ధం కాలేదు. “పోలీసులు చూస్తే సమస్య గానీ…. పిల్లలు చూస్తే సమస్య ఏంటి” అని అడిగాడు. అప్పుడు ఆ […]
error: Content is protected !!